ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాలపై మిస్టరీని క్లియర్ చేశారు నిర్మాత నాగవంశీ. బన్నీతో, చరణ్‌తో సినిమా అనేది ఊహాగానమేనని స్పష్టం చేశారు. తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన నాగవంశీ

“త్రివిక్రమ్ గారి తర్వాతి రెండు ప్రాజెక్టులు వెంకటేశ్ గారితో, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్నతోనే. మిగతావన్నీ కేవలం వదంతులే. అధికారికంగా నేను ప్రకటించినదే నిజం” అని తేల్చేశారు.

👉 వెంకటేశ్ – ఫ్యామిలీ ఎమోషన్స్

ముందుగా వెంకటేశ్‌తో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కనుంది. త్రివిక్రమ్ స్టైల్‌లో వినోదం, భావోద్వేగాలు మేళవించే కథగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

👉 ఎన్టీఆర్ – పౌరాణికం తొలిసారి!

వెంకీ సినిమా తర్వాత త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ గ్రాండ్ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పౌరాణిక పాత్ర కావడం, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో-మైథలాజికల్ ఫాంటసీగా రూపొందే ఈ సినిమా భారతీయ మౌలిక కథల్ని ఆధునికంగా చెప్పే ప్రయత్నంగా ఉంటుందట.

త్రివిక్రమ్ సినిమాలపై వచ్చే రూమర్లన్నింటికీ ఇదే ఫుల్‌స్టాప్.

బన్నీ, చరణ్ పేర్లు వినిపించినా — ప్రాజెక్టులు మాత్రం వాస్తవం కావు. అధికారికంగా వస్తేనే నమ్మండి! తదుపరి వివరాలు త్వరలో. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ — త్రివిక్రమ్ మళ్లీ తన కలం నుంచి కొత్త తంత్రాలని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు!

, , ,
You may also like
Latest Posts from